Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఎస్సై ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

ఎస్సై ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

ఎస్సై ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు

హర్షం వ్యక్తం చేసిన వాహనదారులు 

స్పాట్ వాయిస్ నర్సంపేట, (ఖానాపురం ): నర్సంపేట నుంచి కొత్తగూడ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి ఖానాపురం మండలం అశోక్ నగర్ నుంచి పాఖాల కొత్తగూడ మధ్య పెద్ద పెద్ద గుంతల మయంగా మారింది. దీంతో ఈ రహదారి గుండా ప్రయాణం ఇబ్బందికరంగా మారి వాహన దారులు నానా అవస్థలు పడుతున్నారు. రెండు సంవత్సరాలుగా గుంతల మాయంగా ఉండడంతో ఖానాపురం మండలం గుండా కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో వాహన దారుల ఇబ్బందులను గమనించిన ఖానాపురం ఎస్సై పిట్టల తిరుపతి వర్షాకాలంలో ఈ రహదారి గుండా ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని గ్రహించారు. వెంటనే అశోక్ నగర్ గ్రామానికి చెందిన జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో మట్టిని తీసుకువచ్చి రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా చిలకమ్మ నగర్ గ్రామ ప్రజలు, అటువైపు ప్రయాణించే వాహనదారులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు కానిస్టేబుల్ సుమన్ పాల్గొన్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments