Monday, April 21, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఏసీబీ ట్రాప్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

ఏసీబీ ట్రాప్‌లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘటన
స్పాట్ వాయిస్, తొర్రూరు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబూబాద్ జిల్లా తొర్రూరు టౌన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ధరంసోత్ వెంకన్నకు సంబంధించిన లేబర్ కార్డ్, మరణ ప్రయోజనం మంజూరు కోసం తొర్రూర్ టౌన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పొలం సుమతి రూ.20వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. గురువారం పక్కా ప్లాన్ తో అధికారిని పట్టుకున్నారు. సదురు అధికారిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments