Thursday, April 17, 2025
Homeక్రైమ్షార్ట్ సర్క్యూట్ తో కాలిన పూరి గుడిసె

షార్ట్ సర్క్యూట్ తో కాలిన పూరి గుడిసె

షార్ట్ సర్క్యూట్ తో కాలిన పూరి గుడిసె 

స్పాట్ వాయిస్,మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని నాచారం గ్రామ పంచాయతీ పరిధిలోని కాలవేణి సమ్మయ్య పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. సమ్మయ్య కుటుంబీకులు ఆదివారం ఉదయం పొలం పనికి వెళ్లి వచ్చేసరికి దట్టంగా మంటలు వ్యాపించడంతో గమనించిన గ్రామస్తులు నీళ్లతో చల్లార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.వేసవి కాలం కావడంతో క్షణాల్లోనే మంటలు మొత్తం ఇంటికి వ్యాపించాయని, ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యం, వంట పాత్రలు మంచాలు, గృహోపకరణాలు, విలువైన వస్తువులు అగ్నికి కాలి బూడిద అయ్యాయని బాధితులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత సమ్మయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments