Sunday, May 25, 2025
Homeక్రైమ్ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

ఆటోలో వెళ్తున్న ఐదుగురు కూలీలు మృతి..

మరో పది మందికి గాయాలు..

స్పాట్ వాయిస్, క్రైమ్: ఘోర రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన 5 గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో 23 మంది ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వీరంతా నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం నర్సాపురంకు చెందిన వారు. గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments