Saturday, June 7, 2025
Homeజిల్లా వార్తలునర్సంపేటలో మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నర్సంపేటలో మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నర్సంపేటలో మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

స్పాట్ వాయిస్, నర్సంపేట : నియోజకవర్గంలో అతి త్వరలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఎమ్మెల్యే పెద్ది కలిసి స్థానిక రైతుల ఇబ్బందిని మంత్రి కి వివరించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దీంతో స్పందించిన మంత్రి మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో త్వరలో నర్సంపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే పెద్ది తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు (ఎంఎస్పీ) ధరకే మక్కల కొనుగోలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నర్సంపేట డివిజన్ లోనే జిల్లాలో అత్యధికంగా 50 వేల ఎకరాలలో మొక్కజొన్న పంట దిగుబడి వచ్చిందని రైతులు పండించిన మక్కలను (యాసంగి) భద్రం చేసుకుని కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని ఎమ్మెల్యే కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments