Saturday, September 21, 2024
Homeతెలంగాణకలిసి పోరాడుదాం.. లేకపోతే కేసీఆర్ బతకనివ్వడు..

కలిసి పోరాడుదాం.. లేకపోతే కేసీఆర్ బతకనివ్వడు..

కలిసి పోరాడుదాం..
లేకపోతే కేసీఆర్ బతకనివ్వడు..
ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దాం
ఉమ్మడి కార్యాచరణ చేద్దాం..
బండి, రేవంత్‌కు షర్మిల ఫోన్..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: కలిసి పోరాడుదాం రండి అంటూ వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శనివారం ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచరణ చేద్దామని చెప్పిన షర్మిల ప్రగతి భవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనివ్వడని షర్మిల అన్నారు. షర్మిల ఫోన్‌కాల్‌పై బండి సంజయ్, రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని బీజేపీ నేత స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ బదులిచ్చారు.
పేపర్ లీక్ పై సీరియస్..
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశాన్ని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సీరియస్‌గా తీసుకున్నారు. లీకేజ్‌లో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు షర్మిల పోరాటం చేశారు. రెండు సార్లు షర్మిల పోరాటాన్ని పోలీసులు అడ్డుకోగా.. నిన్న మూడో సారి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిరుద్యోగుల విషయంలో పోరాడాలని షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు బీజేపీ నేత బండిసంజయ్, కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డికి ఫోన్‌లు చేసి.. కలిసి పోరాడుదామంటూ షర్మిల పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments