Friday, September 20, 2024
Homeక్రైమ్మిర్చి లోడ్ తో ఉన్న టాటా ఏస్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు 

మిర్చి లోడ్ తో ఉన్న టాటా ఏస్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు 

టాటా ఏస్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు 

ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు 

బాధితులు సూర్యాపేట జిల్లా వాసులు

స్పాట్ వాయిస్, రాయపర్తి : రాయపర్తి మండల పరిధి మైలారం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోల్లబండ తండాకు చెందిన ధరావత్ శ్రీను, ధరావత్ బీమా, బానోత్ వెంకన్న మంగళవారం ఉదయం టాటా ఏస్ వాహనంలో మిర్చి లోడును తీసుకుని వరంగల్ లోని ఏనుమాముల మార్కెట్ కు వస్తున్నారు. ఈ క్రమంలో రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో టాటా ఏస్ వాహనం టైరు పంచర్ అయింది. దీంతో రోడ్డు పక్కన వాహనాన్ని నిలపగా ఆర్టీసీ బస్సు వెనుకనుంచి వచ్చి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ధరావత్ శ్రీను అక్కడికక్కడే చనిపోయారు. ధరావత్ బీమా, బానోత్ వెంకన్న కు తీవ్ర గాయాలు కాగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్లు  తెలిసింది. కాగా, ఈ ఘనటకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments