Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుపార్టీ బలోపేతానికి కృషి చేయాలి..

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి..

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి 

బీఆర్ ఎస్ ఐనవోలు మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: పార్టీ పటిష్టతే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని బీఆర్ఎస్ ఐనవోలు మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి అన్నారు.ఆదివారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేష్ ఆదేశాల మేరకు మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ఇన్ఛార్జులు, గ్రామ సమన్వయ కమిటీ, అనుబంధ సంఘాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో పలు అభివృద్ధి పనులతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నందనం గ్రామాన్ని మరింత అభివృద్ధి జరిగేలా కృషి చేస్తామన్నారు.గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల దృష్టి కి తీసుకెళ్లి ప్రతిపక్షాలను ఎత్తుగడలను తిప్పికొట్టేలా సోషల్ మీడియా ముందుండలన్నారు.గ్రామాల్లో అన్ని అనుబంధ కమిటీలను పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీ రాములు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్,మండల పార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి, ప్రధానకార్యదర్శి బుర్ర రాజశేఖర్, సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు,దర్గా సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు, నియోజకవర్గ అధికార ప్రతినిధి మిద్దెపాక రవిందర్ ,సొసైటీ డైరెక్టర్ వడిచర్ల శ్రీనివాస్,ఎస్సి సెల్,మహిళా విభాగం,యూత్,సోషల్ మీడియా విభాగాల అధ్యక్షులు కొమురయ్య, దేవికారెడ్డి, నరేష్, అరుణ్ కుమార్, గ్రామ సర్పంచ్ యాకర మంజుల యాదగిరి,గ్రామ పార్టీ అధ్యక్షులు జున్న లవన్, వార్డు మెంబర్లు సుదర్శన్, రాజశేఖర్, రవి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments