బువ్వేసి.. పప్పేసి..
సీఎం పర్యటనలో
భోజనం వడ్డించిన మంత్రి ఎర్రబెల్లి..
స్పాట్ వాయిస్, నర్సంపేట : సీఎం కేసీఆర్ గురువారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బిజీ షెడ్యూల్ సందర్భంగా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు బస్సు లోనే భోజనం చేశారు. బస్సులోని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొసరి కొసరి వడ్డించారు. పులిహోరతోపాటు పప్పు, ఫ్రై కర్రీ లు, ఇతర ఆహార పదార్థాలను స్వయంగా వడ్డిoచారు.. ఎర్రబెల్లి వడ్డింపులో పులిహోర, ముద్ద పప్పు స్పెషల్ గా కనిపించింది. మంత్రులు, ఉన్నతాధికారులు ఇష్టంగా భోజనం చేశారు.
Recent Comments