Sunday, April 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఎమ్మెల్సీ కవితకు మరోసారి సుప్రీం కోర్టు షాక్..

ఎమ్మెల్సీ కవితకు మరోసారి సుప్రీం కోర్టు షాక్..

24నే పిటిషన్ విచారిస్తామన్న కోర్టు
స్పాట్ వాయిస్, బ్యూరో: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. తన పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలన్న కవిత అభ్యర్థనను తిరస్కరించింది. ఈనెల 24నే విచారిస్తామని ఉన్నతన్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈడీ తనను విచారణకు పిలవడాన్ని సవాల్‌ చేస్తూ శుక్రవారం కవిత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. 24న విచారిస్తామని కోర్టు తెలిపింది. గురువారం ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. దీంతో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 తేదీలోపే తన పిటిషన్‌పై విచారణ జరపాలని మరోసారి సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించింది. అయితే కవిత పిటిషన్‌ను తాము ముందు చెప్పిన విధంగా 24నే విచారిస్తామని.. దాంట్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments