Friday, September 20, 2024
Homeకెరీర్ఏఈ పరీక్ష రద్దు

ఏఈ పరీక్ష రద్దు

ఏఈ పరీక్ష రద్దు

టీఎస్‌పీఎస్సీ ప్రకటన

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్ :టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తూ.. మలుపులు తిరుగుతుంది. ప్రశ్నపత్రం లీకేజీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మళ్లీ ఈ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది తొందరలోనే వెల్లడిస్తామని కమిషన్‌ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 837పోస్టులకు 74, 478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 55వేల మంది పరీక్ష రాశారు. అయితే ప్రశ్నపత్రం లీకయినట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో.. పరీక్షను పూర్తిగా రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments