Wednesday, May 28, 2025
Homeక్రైమ్రేవంత్ సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..

రేవంత్ సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదం..

కారు, బైక్ ఢీ.. 

ఒకరి మృతి..

మరొకరి పరిస్థితి విషమం..

రేవంత్ సభకు వెళ్లి వస్తుండగా ప్రమాదం…

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీ నగర్ లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరి పరిస్థితి విషయమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రేగొండ మండలం రామన్నగూడెం తండాకు చెందిన బాబావత్ చందు (32) ను మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి జోడో యాత్రకు వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో అతడి బైక్ ను కారు ఢీకొట్టింది. దీంతో అతడి వెనకాలే మిర్చిలోడుతో వస్తున్న బొలెరో వాహనంపై పడిపోయాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన చందు చనిపోయాడు. కాగా, ఈ ఘటనలో బస్దావత్ శ్రీనుకు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం శ్రీను పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments