విషమంగా పరిస్థితి
వరంగల్ ఎంజీఎంకు తరలింపు
స్పాట్ వాయిస్, నర్సంపేట: కుటుంబ కలహాలతో భార్యతో పాటు కొడుకుపై కత్తితో వ్యక్తి దాడి చేసిన ఘటన నర్సంపేట మండలంలోని చద్రయ్యపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన నిడిగొండ కోటిలింగం, భార్య, కుమారుడితో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. నిత్యం కుమారుడు, భార్యతో గొడవలకు దిగేవాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినట్లు తెలుస్తోంది. మరల గొడువలు జరుగుతుండడంతో వారి సొంత గ్రామం చద్రయ్యపల్లి చేరుకుని మాట్లాడుకుంటున్న సందర్బంలో కోటిలింగం భార్య విజయ, కుమారుడు ప్రవీణ్ పై ఒక్క సారిగా కత్తితో దాడి చేసినట్లు సమాచారం. భార్య గొంతు భాగంలో, కొడుకు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు నర్సంపేట ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారు. చేసిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments