Saturday, May 31, 2025
Homeక్రైమ్కూలీల ఆటో బోల్తా..

కూలీల ఆటో బోల్తా..

ప్రయాణిస్తున్న 15 మంది కూలీలు..
ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం..
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పొట్ట కూటి కోసం కూలీకి వెళ్తున్న వారి ఆటో బోల్తా పడింది. వివరాల్లోకి వెళ్తే.. గోవిందరావుపేట మండలం మోద్దులగూడెం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పనులకు వెళ్తున్నారు. ఆటోలో 15 మందికి పైగా వరకు ఉన్నారు. ఉదయం మేడారం నార్లాపూర్ వైపు వెళ్తుండగా నార్లాపూర్ గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీల్లో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రులను ములుగు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలింంచారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments