తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం..
స్పాట్ వాయిస్, బ్యూరో : గణతంద్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరేడ్తో కూడిన వేడుకలు జరపాలని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కొవిడ్ -19 సాకుగా చూపి వేడుకలను ఆపడం కరెక్ట్ కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. గణతంత్ర దినోత్సవ వేడుకలపై కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం తప్పక పాటించాలని హైకోర్టు స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
గణతంత్ర వేడుకలను నిర్వహించాల్సిందే..
RELATED ARTICLES
Recent Comments