మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇర్ఫాన్
స్పాట్ వాయిస్, భూపాలపల్లి టౌన్: మైనారిటీ కార్పొరేషన్ రుణాల ఆన్ లైన్ దరఖాస్తుకు సోమవారం చివరి తేదీ అని, భూపాలపల్లి పట్టణ ముస్లింలు దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇర్ఫాన్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వెనుకబడిన ముస్లిం కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలను అందిస్తుందన్నారు. మీసేవ ద్వారాదరఖాస్తు చేసుకొని దరఖాస్తు పత్రంతో పాటు సంబంధిత పత్రాలను మున్సిపాలిటీ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
మైనార్టీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ
RELATED ARTICLES
Recent Comments