Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్26నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

26నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర

రోజుకు 19 కిలో మీటర్లు..
126 రోజులు యాత్ర
 స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణలో మరో పాదయాత్ర మొదలుకాబోతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం ఖరారు ఫిక్స్ అయింది. ఈనెల 26 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై మూడు ప్రాంతాలు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. భద్రాచలం, జోడేఘడ్, జోగులాంబ నుంచి ఏదోఒకటి ప్లేస్ ఫైనల్ అవుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జీ వచ్చిన తర్వాత ఫైనల్ చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 19 కిలోమీటర్లు, 126 రోజులు యాత్ర ఉంటదని తెలిపారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు,నేతలు అందరూ సమన్వయంతో పనిచేయాలని మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ యాత్ర చేయనున్నారు. త్వరలోనే యాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించనుందని చెప్పారు. ఇటీవల మల్లిఖార్జున ఖర్గేతో జరిగిన భేటీలోనూ పాదయాత్రకు సంబంధించి రేవంత్ చర్చించినట్లు సమాచారం. అందుకు ఖర్గే కూడా సుముఖత వ్యక్తం చేశారని రేవంత్ వర్గం నాయకులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments