Saturday, September 21, 2024
Homeక్రైమ్ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఇల్లు కాల్చేశారు..

ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఇల్లు కాల్చేశారు..

స్పాట్ వాయిస్, కమలాపురం: తమ ప్రేమ‌ను పెద్దలు తిర‌స్కరిస్తార‌నే భ‌యంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అనంత‌రం ఆ జంట ప‌రార్ అయింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు కోపంతో ఊగిపోయారు. యువ‌కుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దారుణ ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని హుజురాబాద్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. హుజురాబాద్‌కు చెందిన ఓ జంట కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే త‌మ ప్రేమ‌ను పెద్దలు అంగీక‌రించ‌ర‌నే భ‌యంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఇద్దరూ క‌లిసి పారిపోయారు. ఈ విష‌యం అమ్మాయి త‌ల్లిదండ్రుల‌కు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై అమ్మాయి కుటుంబ స‌భ్యులంద‌రూ యువ‌కుడి ఇంటికి వెళ్లారు. ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఇంట్లో ఉన్న ఫ‌ర్నిచ‌ర్, విలువైన వ‌స్తువులు కాలిపోయాయి. ఇంట్లో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్రమాదం త‌ప్పింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments