మా ప్రిన్సిపాల్ను బదిలీ చేయండి..
రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు
స్పాట్ వాయిస్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం ఉదయం గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ విద్యార్థినులు క్లాసులు మానేసి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ చైతన్య వేధింపులు తట్టుకోలేకపోతున్నామని కన్నీరు పెట్టుకున్నారు. ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపాల్ను బదిలీ చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థినులు భీష్మించారు. తమకు ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వడం లేదని.. కనీసం దెబ్బలు తగిలినా ఇంటికి పంపించడం లేదని వాపోయారు. ఇలాంటి ప్రిన్సిపాల్ తమకు వద్దంటూ ఆందోళన చేస్తున్నారు.
మా ప్రిన్సిపాల్ను బదిలీ చేయండి..
RELATED ARTICLES
Recent Comments