Saturday, September 21, 2024
Homeరాజకీయందమ్ముంటే అభివృద్ధి పై చర్చకు రా..!

దమ్ముంటే అభివృద్ధి పై చర్చకు రా..!

దమ్ముంటే మండల అభివృద్ధి పై చర్చకు రా..!
-బీఆర్ఎస్ దామెర మండల పార్టీ అధ్యక్షుడు గండు రామకృష్ణ.
స్పాట్ వాయిస్ దామెర:దమ్ముంటే మండల అభివృద్ధి పై బిజెపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి చర్చకు రావాలని బీ ఆర్ ఎస్ దామెర మండల పార్టీ అధ్యక్షుడు గండు రామకృష్ణ అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మొరగుకురా మొలుగూరి.. దమ్ముంటే దామెర మండల అభివృద్ధి పై చర్చకు రా అని సవాలు విసిరారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పైన నలుగురిని వెంటపెట్టుకుని అవాకులు చేవాకులు పేలిపోవడం కాదని దమ్ముంటే అభివ్రుధ్ధిపై చర్చకు రావాలని అన్నారు.పులుకుర్తి గ్రామ రైతులను మేము అంబెడ్కర్ విగ్రహం వద్దకు తీసుకుని వస్తామని,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతుల భూములు గుంజుకున్నట్లు దమ్ముంటే నిరూపించాలని డిమాండు చేసారు.అభివ్రుధ్ధిలో భాగంగా ప్రజల అవసరాల కోసం రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నా ప్రజా సేవకుడు ఎమ్మెల్యే ధర్మారెడ్డి మీద అసత్య ప్రచారాలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.అనంతరం ఎంపీపీ కాగితాల శంకర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన దామెర మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నా ఘనతా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిదని అన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే భాజపా నాయకులు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.అనంతరం వైస్ ఎంపీపీ జాకీర్ అలీ మాట్లాడుతూ.. నీకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సిఎం కెసిఆర్,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం ఆర్ ఎఫ్ నిధులనుండి రూ. 50 లక్షలు మంజూరు చేసి నీకు ప్రాణబిక్ష పెడితే, వారిపైనే అసత్యపు ఆరోపణలు చేస్తున్నా నమ్మక ద్రోహి మొలుగూరి భిక్షపతి అని అన్నారు.కన్నతల్లి రొమ్ము కోసే రాక్షసుడు మొలుగూరి అని ఆరోపించారు. రాజకీయంగా బిక్ష పెట్టిన బీ ఆర్ ఎస్ పార్టీని వీడి, ఎలక్షన్ల ముందు కండువాలు మార్చి వేషాలు వేసుకునే నిన్ను చూసి గంగిరెద్దులు కూడా సిగ్గుపడుతున్నాయని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే చల్లా చిన్న గ్రామ పంచాయతీకి మంజూరు చేసినన్ని నిధులు, నీవు ఎమ్మెల్యే గా ఉన్న కాలంలో నియోజకవర్గ మొత్తానికి కూడా తీసుకురాలేదని అన్నారు. అగ్రంపాడు సమ్మక్క సారక్క జాతర నుంచి మొదలుపెడితే పరకాలలో, ఆత్మకూర్, సంగెం మండలం లోని కాకతీయ టెక్స్టైల్ పార్క్ వరకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి కంటికి కనిపించడం లేదా అని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే చేయని పని ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రజానాయకుడు చల్లా ధర్మారెడ్డి పైన తప్పుడు ప్రచారం చేస్తే రాబోయే రోజుల్లో మీకు ప్రజలు, కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు..ఈ కార్యక్రమంలో మండల ఎంపిటిసిల అధ్యక్షుడు పోలం కృపాకర్ రెడ్డి,మండల దళితబంధు చైర్మన్ గరిగే కృష్ణమూర్తి,మండల నాయకులు దామెరుప్పుల శంకర్,పుణ్ణం సంపత్, దాడి మల్లయ్య,జన్ను మల్లయ్య, మార్కెట్ డైరెక్టర్ కౌటం మోహన్, సర్పంచ్ పురాణం ఈశ్వర్, దామెర గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని రాజు, ప్రధాన కార్యదర్శి వేల్పుల ప్రసాద్, నాయకులు అలెటి రాజమౌళి, బాబురావు, బోనగాని రాజు,సంతోష్, శివ గౌడ్, విజయ్, వినయ్, మహేష్, అశోక్,తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments