Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలువేoకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వేoకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

పాల్గొన్న ప్రజాప్రతినిధులు

స్పాట్ వాయిస్ నర్సంపేట (ఖానాపురం) : ఖానాపురం మండలంలోని బుధరావుపేట గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రామస్వామి నాయక్ మాట్లాడుతూ నూతన సంవత్సరం నేటి నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రకాష్ రావు జడ్పిటిసి బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ
మాజీ చైర్మన్ శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట రాం నరసయ్య, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments