Sunday, April 20, 2025
Homeక్రైమ్వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలి మృతి
బైకును ఢీకొన్న సిమెంట్ లారీ
నర్సంపేట మండలం ఆకులతండాలో విషాదం
స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట- మల్లంపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలిద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఆకులతండాకు చెందిన ధరావత్ పాచ్య, నాగమ్మ దంపతులు తమ మనుమరాలు (కుమారుడి కూతురు) పూర్ణిమతో కలిసి ద్విచక్ర వాహనం పై శుక్రవారం ఉదయం మందుల కోసం సమీపంలోని ఇటుకాలపల్లిలోని మెడికల్ షాపునకు వెళ్లారు. మందులు తీసుకున్న అనంతరం స్వగ్రామానికి వస్తుండా నర్సంపేట-మల్లంపల్లి 365 జాతీయ రహదారి ఇటుకాలపల్లి గ్రామ పరిధిలో వారు ప్రయాణిస్తున్న బైక్ ను సిమెంటు లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మనవరాలు పూర్ణిమ (3) అక్కడికక్కడే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన పాచ్య, నాగమ్మ దంపతులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పాచ్య(62) కూడా చనిపోయాడు. ప్రస్తుతం నాగమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన పూర్ణిమ తండ్రి యాకూబ్ సీఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ గా చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పనిచేస్తున్నట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో తాత మనవరాలిద్దరూ చనిపోవడంతో ఆకులతండాలో విషాదం నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments