Monday, September 30, 2024
Homeతెలంగాణఇలా జైల్లోంచి రాగానే.. అలా మళ్లీ అరెస్ట్

ఇలా జైల్లోంచి రాగానే.. అలా మళ్లీ అరెస్ట్

ఎమ్మెల్యే కొనుగోలు నిందితుల కేసులో కీలక ఘటన
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఫాం హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న A1 రామచంద్ర భారతి, A2 నందకుమార్ చంచల్ గూడ జైల్ నుంచి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకి రాగానే వారిద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలయ్యారు. రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతీ సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments