Monday, September 30, 2024
Homeజిల్లా వార్తలుఏవీబీఎస్ బీటీ ఆధ్వర్యంలో సిరికొండకు సన్మానం

ఏవీబీఎస్ బీటీ ఆధ్వర్యంలో సిరికొండకు సన్మానం

ఏవీబీఎస్ బీటీ ఆధ్వర్యంలో సిరికొండకు సన్మానం
స్పాట్ వాయిస్, వరంగల్ : వరంగల్ ములుగు రోడ్డు అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంతంలోని ఆదర్శ విశ్వబ్రాహ్మణ సంక్షేమ భవన ట్రస్ట్ (ఏవీబీఎస్ బీటీ) ఆధ్వర్యంలో ఆదివారం సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు సిద్ధోజు విద్యాసాగర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు జాతీయులైన మధుసూదనాచారి ఎమ్మెల్సీగా నియామకమైన సందర్భాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విశ్వబ్రాహ్మణుల పిల్లల అభ్యున్నతికి పక్కా భవనాన్ని నిర్మించుకోవడానికి నిధులు సమకూర్చాలని కోరారు. అనంతరం మధుసూదనాచారి మాట్లాడుతూ సుమారు 500 మంది సభ్యులు ట్రస్ట్ లో భాగస్వామ్యమై నగరానికి అతి చేరువలో అర ఎకరం స్థలం కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ నిర్మించి నిర్వహించుకోవడం విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు నిదర్శనమన్నారు. ట్రస్ట్ సభ్యుల వినతి మేరకు శాశ్వత భవన నిర్మాణానికిగాను తన వంతుగా త్వరలో నిధులు మంజూరు చేసి ఉత్తర్వులతో మరొకసారి వస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చిట్టిమల్ల రామచంద్రం, వేల్పుల దేవాచారి, పెందోట చక్రపాణి, మట్టెవాడ ఆనందరావు, బొజ్జ వెంకటేశ్వర్లు, డాక్టర్ అనసూరి చంద్రమౌళి, ఆకోజు సురేందర్ రావు, డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, మారడోజు సదానందచారి, తాడూరి బ్రహ్మయ్య, పొనుగోటి సారంగపాణి, మట్టెవాడ బ్రహ్మచారి, చిలుపూరి శ్రీధర్, సూరోజు రమేష్, కట్టా రాజు, సిద్ధోజు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments