Thursday, April 17, 2025
Homeలేటెస్ట్ న్యూస్వైఎస్ షర్మిల బస్సుకు నిప్పుపెట్టిన టీఆర్ఎస్ నేతలు

వైఎస్ షర్మిల బస్సుకు నిప్పుపెట్టిన టీఆర్ఎస్ నేతలు

పాదయాత్రలో ఉద్రిక్తత
స్పాట్ వాయిస్, చెన్నారావుపేట: వైఎస్సార్ టీపీ అధినాయకురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. సోమవారం.. చెన్నారావుపేట మండలం లింగగిరిలో లంచ్ బ్రేక్ లో కాన్వాయ్ లోని బస్ ను టీఆర్ఎస్ అనుచరులు తగలబెట్టారు. షర్మిల పాదయాత్ర వాహనాలపై కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు షర్మిల కాన్వాయ్ లోని ఒక బస్సుకు నిప్పు పెట్టారు. షర్మిల గో బ్యాక్.. ఎమ్మెల్యే పెద్దికి క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారని అటు వైఎస్సార్ టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బస్సు పాక్షికంగా దగ్ధం అయింది. నిప్పు అంటించగానే అక్కడ ఉన్న వాళ్లు అప్రమత్తం అయి మంటలను ఆర్పీ వేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments