Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుజాతీయ రహదారిపై బూడిదైన లారీ

జాతీయ రహదారిపై బూడిదైన లారీ

స్పాట్ వాయిస్ మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం లారీ ప్రమాదవశాత్తు కాలిపోయింది. కర్ణాటక హోసపేట్ నుంచి ఒడిశాకు చార్ కోల్, ఇతర రసాయనాలతో వెళ్తున్న లారీ టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకుని మంటలు వ్యాపించడంతో లారీ పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ రంజిత్ రావు, ఎస్సై శ్రీనివాసు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేలోగా లారీ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments