Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలులక్షా ఇరవై వేల మెజార్టే లక్ష్యం

లక్షా ఇరవై వేల మెజార్టే లక్ష్యం

లక్షా ఇరవై వేల మెజార్టే లక్ష్యం
ఐనవోలు టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శంకర్ రెడ్డి
వర్ధన్నపేటలో కారు గెలుపునకు కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపు
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : వర్ధన్నపేట నియోజకవర్గంలో గతంలో కన్నా అధిక మెజారిటీతో టీఆర్ ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను గెలిపించడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పార్టీ మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. గురువారం ఐనవోలు మండలం నర్సిహులగూడెంలో టీఆర్ ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు కట్కూరి బాబు ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలేపల్లి శంకర్ రెడ్డి, గ్రామ పార్టీ ఇన్ చార్జి లు సింగారపు రాజు, ఎండీ గుంశావలితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సాధించిన లక్ష ఓట్ల మెజార్టీ కన్నా అధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం టీఆర్ ఎస్ గ్రామ పార్టీ ఇన్ చార్జిలుగా సింగారపు రాజు, మండల కో ఆప్షన్ మెంబర్ గుంశావలి ని నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, రఘోత్తమ రెడ్డి, సురేందర్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, మహేందర్ రావు, లక్ష్మణ రావు, కొమురారెడ్డి, యాకూబ్ రెడ్డి, కిరణ్, ఇల్లందుల రమేష్, సదానందం, రావుల భిక్షపతి, పోలెపాక వెంకటేష్, కె.వెంకటేష్, కె.రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments