Saturday, June 7, 2025
Homeక్రైమ్బారికేడ్ ను ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు

బారికేడ్ ను ఢీకొన్న వ్యక్తికి తీవ్ర గాయాలు

బారికేడ్ ను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

353 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పరశురాంపల్లి గ్రామానికి చెందిన ఆర్.ఎంపీ డాక్టర్ బండి మల్లయ్య ఆదివారం సాయంత్రం వ్యక్తిగత పనులు ముగించుకుని పరకాల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో మైలారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటుచేసిన బారికేడును ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీంతో మల్లయ్యకు త్రీవ గాయాలయ్యాయి. 353 జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ గుంతలు తవ్వారు. ప్రమాదం సంభవించకుండా రక్షణగా పోలీసులు బారికేడును ఏర్పాటు చేశారు. చీకట్లో బైక్ పై వస్తున్న మల్లయ్యకు అవి కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments