Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుసీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు

సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు

ఐనవోలులో అంబరాన్నింటిన సంబురాలు..
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించగా.. ఐనవోలు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు హాజరై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి బాణా సంచా కాల్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి మునుగోడు ప్రజలు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు ఎన్ని చేసినా వారికి తగిన బుద్ధి చెప్పిన తెలంగాణ ప్రజానీకం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్నేని మధుమతి రవీందర్ రావు, మండల అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, జెడ్పీ కో- ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మజ్జిగ జయపాల్, ఆలయ మాజీ చైర్మన్ మునిగాల సంపత్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందర్ రావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, నాయకులు పల్లకొండ సురేష్, వడిచర్ల శ్రీనివాస్, కొమురయ్య, పరమేశ్వర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments