Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

స్పాట్ వాయిస్, గీసుకొండ: గుండె పోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొమ్మాల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… కొమ్మాల గ్రామానికి చెందిన బోడిగే కుమారస్వామి (55 ), మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట ఎంపీపీఎస్ లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే కుమారస్వామి ఛాతీలో స్వల్ప నొప్పి మొదలైంది. వెంటనే ప్రధాన ఉపాధ్యాయుడికి చెప్పి ఇంటికి బయలుదేరారు. ఖానాపూర్ నుంచి నర్సంపేట బస్టాండ్‌లో గుండె పోటుకు గురయ్యారు. కింద పడిపోయిన కుమారస్వామి సమాచారాన్ని ప్రయాణికులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వెంటనే వారు హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స చేస్తున్న తరుణంలో మరోసారి గుండెపోటు రావడంతో కుమారస్వామి మృతిచెందారు. మృతుడి భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. మృతుడికి భార్య శ్రీలత, కుమారులు శ్రీకర్, శ్రేష్టన్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments