Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలులూయిస్ అంధుల పాఠశాలలో అన్నదానం

లూయిస్ అంధుల పాఠశాలలో అన్నదానం

హాజరైన 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యొలుగం లీలావతి సత్యనారాయణ
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ కొత్తవాడ ఆటో నగర్‌లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాలలో శ్రీమాత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమాన్ని 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యొలుగం లీలావతి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు 25 మంది విద్యార్థులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో శ్రీమాత స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ అధ్యక్షుడు ముద్దసాని మల్లిక, ప్రధాన కార్యదర్శి నన్నపునేని సంజీవరావు, కోశాధికారి కె.కళ, ఎం.రాజేశ్వర్ రావు, నల్లెల్ల జనార్దన్, మిలంధుల రమేశ్, ఎండీ రజాక్, కె.నరేష్, బి. రాజేశ్, పాఠశాల వ్యవస్థాపకులు ఎన్. కుమారస్వామి, ఎన్.కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments