Sunday, September 22, 2024
Homeతెలంగాణబాధితులను పరామర్శిస్తూ.. నేనున్నాననే ధైర్యాన్నిస్తూ..

బాధితులను పరామర్శిస్తూ.. నేనున్నాననే ధైర్యాన్నిస్తూ..

ఎమ్మెల్సీ సిరికొండ సుడిగాలి పర్యటన
స్పాట్ వాయిస్, గణపురం: ఆపదలో ఉన్న వారికి నేన్నానంటూ.., మృతుల కుటుంబాల కన్నీరు తూడుస్తున్నారు ఎమ్మెల్సీ సిరికొండ. ఆపదొచ్చిందంటే పరుగు పరుగున వచ్చి గుండె ధైర్యం అవుతున్నారు. బాధతో నిండిన ఆ ఇంటికి తానున్నానే భరోసానిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో అనారోగ్యంతో మరణించిన బాధిత కుటుంబాలను, ప్రమాద బాధిత కుటుంబాలను శుక్రవారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు.


11 గంటలు 25 కార్యక్రమాలు

మొగుళ్ళపల్లి మండలం అంకుషాపురం గ్రామానికి చెందిన గాలి పర్వతాలు, మండల కేంద్రంలోని తెరాస సీనియర్ నాయకులు ఎర్రబెల్లి పున్నం చందర్ సోదరుడు ఎర్రబెల్లి జనార్ధన్ రావులు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్దకోమటిపల్లి సర్పంచ్ మంద సునీల్ రెడ్డి ప్రమాదంలో గాయపడగా వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చిట్యాల మండల కేంద్రంలో కట్కూరి రాజు ఆత్మీయ ఆహ్వానం మేరకు నూతనంగా ప్రారంభించిన అమిధశ్రీ ఫోటో స్టూడియోని సందర్శించి రాజును ఆశీర్వదించారు. భూపాలపల్లి మండలం అజంనగర్ ఎంపిటీసి భర్త జంగా శ్రీనివాస్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించారు. అలాగే గుడిపాటి చంద్రారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకరి సతీష్ తల్లి సుంకరి బుచ్చమ్మ, తుమ్మెటి నర్సింహరెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంబాపుర్ గ్రామంలో మత్సకారుడు పేరబోయిన వీరసోములు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే గ్రామంలోని అప్పల వెంకన్న అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించారు.
దీక్షకుంట గ్రామంలో మాజీ సర్పంచ్ అల్లుడు శివారెడ్డి, బురెడ్డి దయాకర్, ఏనుగు కృష్ణారెడ్డి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నందిగామ గ్రామంలో అరిగెల నాగార్జున, లక్ష్మి సమ్మక్క, చిడం శంకరయ్య, పాయిలి నాగయ్య, బానోత్ బావుసింగ్, ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వనపర్తి సురేష్ కూతురు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీఆర్ఎస్ నాయకులు ఎండీ జాకీర్ కుమార్తె నూతన వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. సెగ్గంపల్లి సిరికొండ వీరాభిమాని బామండ్లపల్లి అశోక్ తల్లి బామండ్లపల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కారల్ మార్క్స్ కాలనీలో దుర్గం పద్మ, ఖాసింపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొమురవెల్లి రవీందర్ సతీమణి శారద ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేగూరి లక్ష్మారెడ్డి అత్తగారైన మదాటి వెంకటమ్మ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన పాశికంటి శివ అనే యువకుడు మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సిరికొండ యవజన నాయకులు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments