Friday, April 18, 2025
Homeజిల్లా వార్తలు మహనీయుడు మహాత్మాగాంధీ

 మహనీయుడు మహాత్మాగాంధీ

 ప్రపంచం మెచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ
ఎంపీపీ ఊడుగుల సునీత గౌడ్
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: ప్రపంచం మెచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని ఎంపీపీ ఊడుగుల సునీత గౌడ్ కొనియాడారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ హాజరై గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎంపీపీ అహింస మార్గంలో స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీవో ప్రకాష్, ఏపీవో వెంకట నారాయణ, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు గందే శ్రీనివాస్ గుప్తా, ఎంపీటీసీ జన్ను జయరావ్, సర్పంచ్ మోహన్ రెడ్డి, కోటి లింగాచారి, ఇంగ్లీ శివాజీ, మాలోత్ ప్రతాప్, వైనాల వీరస్వామి, గోనెల నరహరి, క్యాతం శ్రీనివాస్, పాండవులు రాంబాబు, బూస సదయ్య, పరికి కొర్నేల్, ఎం.డీ నన్నేసాహెబ్, సాగర్, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments