Friday, September 20, 2024
Homeజాతీయంక్రిమినల్ నేతలకు చెక్.. !

క్రిమినల్ నేతలకు చెక్.. !

నేరారోపణలుంటే ఎన్నికల్లో పోటీకి అనర్హత..!

స్పాట్ వాయిస్ , బ్యూరో: నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర న్యాయ, హోంశాఖలకు నోటీసులు పంపించింది.
బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తీవ్రమైన క్రిమినల్ నేరాలు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా డిబార్ చేయాలని వ్యాజ్యంలో కోరారు. దీనిపై కేంద్రం, ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ రిషికేశ్ రాయ్​తో కూడిన బెంచ్ విచారణ జరిపి నోటీసులు పంపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments