Friday, September 20, 2024
Homeక్రైమ్రైతును బలి తీసుకున్న కరెంట్

రైతును బలి తీసుకున్న కరెంట్

కరెంట్ కు రైతు బలి..
యమ పాశమైన లూస్ వైరింగ్
పంటపొలంలోనే విఘత జీవి అయిన అన్నదాత..
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

స్పాట్ వాయిస్, రేగొండ: తెల్లతెల్లవారుతుండగానే విషాదం. అన్నం పెట్టే రైతన్న కన్ను మూసిన ఘటన. పంట పొలంలో నే విఘత జీవి అయిన విషాదం. కరెంట్ తీగలు యమపాశాలైబలి తీసుకున్నాయి. గంపెడు ఆశతో పంట సాగు చేస్తున్న ఆ కుటుంబ నిండా శోకం ఆవహించింది. రైతు పొలంలో పడి ఉన్న తీరును చూసి ఊరంతా ఘోల్లుమంది.

 

ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా  రేగొండ మండలం దుంపిల్ల పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలం లోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన రైతు బత్తిని కొమురయ్య (45) శుక్రవారం ఉదయం మిరప తోట అచ్చు తోలేందుకు వెళ్ళాడు. అచ్చు కాని ఎత్తు కెళ్తున్న క్రమంలో కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లకు తాకింది. అచ్చు కాని ఇనుప ది కావడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. రైతు మృతి వార్త తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి కన్నీరు పెట్టుకున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే రైతం మృతి చెందాడని గ్రామస్తులు మండిపడుతున్నారు. మృతుడికి భార్య పద్మ , కొడుకు , కూతురు ఉన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments