Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుటీఆర్ఎస్ లోనే ఉంటా..

టీఆర్ఎస్ లోనే ఉంటా..

టీఆర్ఎస్ లోనే కొనసాగుతా..

5వ వార్డు సభ్యురాలు పుప్పాల సరిత-దేవేందర్

స్పాట్ వాయిస్ నర్సంపేట, ఖానాపురం : ఖానాపురం మండలం అయోధ్య నగర్ కు చెందిన 5వ వార్డు సభ్యురాలు పుప్పాల సరిత-దేవేందర్ సోమవారం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరగా మంగళవారం తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు ఎర్ర లింగారెడ్డి టీఆర్ ఎస్ లో చేరగా ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు నివాసంలో ఎంపీపీ, ఓడీసీఎం ఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సరిత-దేవేందర్ మాట్లాడుతూ అయోధ్యనగర్ లో కొందరు కాంగ్రెస్ నాయకులు తనను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారన్నారు. కానీ తాము ఆ పార్టీలో ఉండలేక పోయామన్నారు. అందుకే తిరిగి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటే ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జరుపుల అశోక్, ఉప సర్పంచ్ కూస లింగమూర్తి, వైస్ ఎంపీపీ రామసహయం ఉమ-ఉపేందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ గంగాధరి రమేష్, అశోక్ నగర్ గ్రామ అధ్యక్షుడు ముచ్చ యాదగిరి రావు, నాయకులు గుడిపూడి నాగేశ్వరరావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments