కుటుంబ సభ్యులకు పరామర్శ
స్పాట్ వాయిస్, వరంగల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తక్కలపల్లి పురుషోత్తం రావు తనయుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏఐసీసీ ట్రైనింగ్ డిపార్ట్ మెంట్ కన్వీనర్, తెలంగాణ జన వేదిక కన్వీనర్ తక్కలపల్లి రాము రావు ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వరంగల్ నియోజకవర్గ బీజేపీ నేత గంట రవికుమార్ ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. రాము పార్థివ దేహంపై పూలమాల వేసి శద్ధాంజలి ఘటించారు. రాము కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట వరంగల్ బీజేపీ నాయకులు ఉన్నారు.
Recent Comments