Sunday, September 22, 2024
Homeక్రైమ్పాలేరులో గల్లంతైన విద్యార్థి మృతి

పాలేరులో గల్లంతైన విద్యార్థి మృతి

పాలేరులో గల్లంతైన విద్యార్థి మృతి
మాహబూబాబాద్ లో విషాదం
కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
స్పాట్ వాయిస్, దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలోని పాలేరు వాగులో గల్లంతైన విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద ముప్పారం పాలేరు వాగులో ప్రచండ(16) అనే విద్యార్థి గల్లంతయ్యాడు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ప్రచండ.. ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. ప్రచండ తల్లిదండ్రులు తమ కొడుకు ఎక్కడని స్నేహితులను నిలదీయటంతో గల్లంతైన విషయాన్ని స్నేహితులు బయటపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో ప్రచండ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం మృతదేహాం లభించింది. చేతికంద వచ్చిన కొడుకు విఘత జీవిగా పడి ఉండడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments