Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుమద్యంలో నీళ్లు..

మద్యంలో నీళ్లు..

వైన్ షాపు సీజ్
ఖానాపుర్ లోని శంకర్ వైన్స్ లో ఘటన
స్పాట్ వాయిస్ నర్సంపేట (ఖానాపురం): ఖానాపురం మండలంలోని శంకర్ వైన్స్ లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండల కేంద్రంలోని శంకర్ వైన్స్ లో మద్యం కల్తీ జరుగుతోందనే సమాచారం మేరకు శుక్రవారం రాత్రి దాడి చేశారు. అధికారులు వచ్చేసరికి ని 16 ఐబీ ఆఫ్ బాటిల్స్, ఏడు రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్స్, 7 రాయల్ స్టాగ్ ఆఫ్ బాటిల్స్ మూతలు ఓపెన్ చేసి కల్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కల్తీకి పాల్పడుతున్న మద్యం దుకాణంలో పని చేసే కంది సునీల్ రెడ్డి, భూక్య రవిపై కేసు నమోదు చేసి షాపును సీజ్ చేశారు. ఈ దాడిలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఏఇ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, సీఐలు శ్రీనివాస్ గౌడ్, మాధవి లత, ఎస్సై కిషోర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments