Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుచదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ఏసీపీ శివరామయ్య

స్పాట్ వాయిస్ దామెర: యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏసీపీ శివరామయ్య తెలిపారు. బుధవారం సాయంత్రం మండలంలోని కోగిల్వాయి గ్రామంలో దామెర పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ఏసీపీ శివరామయ్య హాజరై మాట్లాడుతూ… యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలు ఎలాంటి గంజాయి, గుట్కా, పేకాట లాంటి చెడు అలవాట్లకు అలవాటు కాకుండా నిఘా ఉంచాలని తెలిపారు. గ్రామస్తులకు డయల్-100, సైబర్ నేరాల గురించి, వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత, డ్రైవింగ్ లైసెన్స్ గురించి అవగాహన కల్పించారు. గ్రామంలో కొత్తగా అనుమానిత, సంఘ వ్యతిరేక వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. బాల్య వివాహాల నివారణ మాదక ద్రవ్యాలు, ట్రాఫిక్ నిబంధనలు, పలు విషయాలపై ప్రసంగించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం,రూ.2250 విలువ గల గుట్కాలు, రూ.3340 విలువ గల మద్యం స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిప్రియ తెలిపారు. తనిఖీల్లో పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు, పరకాల సీఐ కిషన్, ఆత్మకూరు సీఐ గణేష్, ఎస్సైలు హరిప్రియ, వీరభద్ర రావు, ప్రశాంత్ బాబు, సుమన్, సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments