Sunday, September 22, 2024
Homeక్రైమ్పత్తి చేల్లో వృద్ధుడి ఆత్మహత్య

పత్తి చేల్లో వృద్ధుడి ఆత్మహత్య

పత్తి చేల్లో వృద్ధుడి ఆత్మహత్య
ములుగు జిల్లాలో ఘటన..

స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని నారాయణగిరి పల్లె గ్రామపంచాయతీ పరిధిలో ఓ పత్తి చేనులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధర్మసాగర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన సంగెం లచ్చయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు . పాలంపేట- ములుగుకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న సిమెంట్ బ్రిక్స్ సమీపంలో సదరు వ్యక్తి అచేతనంగా పడి ఉండడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి మరణించినట్టుగా గుర్తించారు. మృతదేహం పక్కనే క్రిమిసంహారక మందు డబ్బా ఉండడంతో అది తాగి మరణించి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కుటుంబ సభ్యులు వెంకటాపురం పోలీసులను సంప్రదించాలని సూచించారు. వృద్ధుడు ఇంతదూరం వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియరాలేదు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments