Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుఫ్రెండ్లీ పోలీస్ కు నిర్వచనం ఎస్సై రమేష్ బాబు

ఫ్రెండ్లీ పోలీస్ కు నిర్వచనం ఎస్సై రమేష్ బాబు

ఫ్రెండ్లీ పోలీస్ కు నిర్వచనం ఎస్సై రమేష్ బాబు

ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సట్ల వెంకన్న

స్పాట్ వాయిస్, కేసముద్రం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ విధానానికి నిర్వచనంగా కేసముద్రం ఎస్సై రమేష్ బాబు నిలుస్తున్నాడని ఎంపీటీసీ ల ఫోరం మండల అధ్యక్షుడు సట్ల. వెంకన్న కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రతీ సమస్యను ప్రజలతో మమేకమై, పరిష్కరిస్తున్నారని కొనియాడారు. ఆదివారం స్థానిక పోలీస్ నివాస గృహాల్లో ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద మహాఅన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఎస్సై రమేష్ బాబు స్వయంగా భక్తులకు, పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు అన్నదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సట్ల.వెంకన్న మాట్లాడుతూ.. ఎస్సై రమేష్ బాబు ఆదర్శనీయుడని అన్నారు. పోలీసులు కూడా అన్నదానం చేయడం పట్ల, ప్రజలకు పోలీసులు అంటే గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గుగులోతు. వీరునాయక్, పోలీసులు సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు,భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments