Monday, September 23, 2024
Homeక్రైమ్అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

స్పాట్ వాయిస్ , రేగొండ: అప్పుల బాధతో ఉరేసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని రంగయ్య పల్లి గ్రామానికి చెందిన దేశిని శ్రీనివాస్ (50) రెండు సంవత్సరాలుగా పంటలు పండక పోవడంతో అప్పుల పాలయ్యాడు. ఈ ఏడాది కూడా తనకున్న రెండు ఎకరాల భూమిలో పత్తి, మిర్చి పంట సాగు చేస్తున్నాడు. అధిక వర్షాలు కురుస్తుండడంతో ఈ ఏడాది కూడా పంట పండుతుందో పండదోనని భయాందోళన, అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో శ్రీనివాస్ శనివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మృతుడి భార్య తరంగిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అతనికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments