Saturday, April 19, 2025
Homeక్రైమ్దైవ దర్శనానికి వెళ్తూ.. దంపతుల మృతి..

దైవ దర్శనానికి వెళ్తూ.. దంపతుల మృతి..

దైవ దర్శనానికి వెళ్తూ.. దంపతుల మృతి..

ఇద్దరు పిల్లలకు గాయాలు
కారును ఢీకొన్న లారీ
నుజ్జునుజ్జు అయిన కారు..

స్పాట్ వాయిస్ , క్రైం: వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న వరంగల్ కాశీబుగ్గకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..కాశీబుగ్గకు చెందిన దంపతులు సురేందర్‌- మాధవి ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం ఉదయం వేములవాడ రాజన్న దర్శనానికి బయలుదేరారు.

కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం ముంజంపల్లి వద్ద కరీంనగర్‌-వరంగల్‌ ప్రధానరహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా, చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కకున్న మృతదేహాలను కష్టంమీద బయటకు తీశారు.
పిల్లలు మేఘన, అశోక్‌ గాయపడ్డగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments