Saturday, September 21, 2024
Homeతెలంగాణహన్మకొండలో టెన్షన్..టెన్షన్

హన్మకొండలో టెన్షన్..టెన్షన్

స్పాట్ వాయిస్ , హన్మకొండ: హన్మకొండ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ బీజేపీ కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర నిర్వహించొద్దంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలంటూ హన్మకొండ ప్రెస్ క్లబ్ పక్కన సెల్ టవర్ ను బీజేపీ కార్యకర్త చిత్తారి రాకేష్ ఎక్కాడు.బండి సంజయ్ పాదయాత్ర అనుమతి ఇస్తేనే దిగుతానంటూ భీష్మించాడు. దీంతో ప్రెస్ క్లబ్ వద్ద తీవ్ర అలజడి నెలకొంది. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి హుటాహుటిన అక్కడి కి చేరుకున్నాడు.

న్యాయపోరాటం చేద్దామని సెల్ టవర్ దిగిరావాలని కార్యకర్త ను బుజ్జగిస్తున్నాడు. పాదయాత్ర కు అనుమతి ఇచ్చేదాకా దిగే ప్రసక్తే లేదని బీజేపీ కార్యకర్త చిత్తారి రాకేష్తెగేసి చెబుతున్నాడు. దీంతో హన్మకొండ బస్టాండ్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం అలుముకుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments