Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్పాదయాత్ర నిలిపివేయండి..

పాదయాత్ర నిలిపివేయండి..

ఫ్లాష్..ఫ్లాష్..
లేదంటే చర్యలు తీసుకుంటాం..
నోటీసులు జారీ చేసిన వర్ధన్నపేట ఏసీపీ
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు బేక్ పడేలా ఉంది. పాదయాత్రను నిలిపివేయాలంటూ బండి సంజయ్‌కి వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్ నోటీసులు జారీ చేశారు.  ప్రజా సంగ్రామ యాత్ర  ప్రముఖ్  గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ కు వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. జనగామలో కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్రను తక్షణమే నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట బండి సంజయ్ విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేశారని, రెచ్చగొట్టే ప్రకటనలతో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments