Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలువజ్రోత్సవాల్లో.. వనమహోత్సవం 

వజ్రోత్సవాల్లో.. వనమహోత్సవం 

మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు
స్పాట్ వాయిస్, కేసముద్రం : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం కేసముద్రంలోని అమీనాపురం గ్రామ పంచాయతీలో, పోలీస్ స్టేషన్లో, ఇనుగుర్తి గ్రామంలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అమీనాపురం గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ రాజమణి ఆధ్వర్యంలో మొక్కలు నాటగా, కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, ఎంపీడీవో రోజా రాణి, ఎంపీఓ రఘుపతి రెడ్డి, ఫారెస్ట్ అధికారులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఎస్సై కోగిల తిరుపతి మొక్కలను నాటారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాఘవ, కానిస్టేబుల్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇనుగుర్తిలో సర్పంచ్ దార్ల రామమూర్తి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఎంపీటీసీ పింగిలి రజిత శ్రీనివాస్, వార్డు సభ్యులు బొబ్బిలి మహేందర్ రెడ్డి, గుజ్జునూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments