Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్గాంధీ సినిమాను వీక్షించిన విద్యార్థులు

గాంధీ సినిమాను వీక్షించిన విద్యార్థులు

గాంధీ సినిమాను వీక్షించిన విద్యార్థులు
స్పాట్ వాయిస్, రేగొండ: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన గాంధీ సినిమాను ఆదివారం రేగొండ మండలం బాగిర్తి పేట ఉన్నత పాఠశాల విద్యార్థులంతా వీక్షించారు. ఈ సందర్భంగా పీఆర్ టీయూ మండల ప్రధాన కార్యదర్శి సూదం సాంబమూర్తి మాట్లాడుతూ గాంధీ సినిమా వీక్షణ విద్యార్థుల్లో దేశభక్తికి ప్రేరణగా ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులకు ఈ అవకాశం కల్పించిన జిల్లా విద్యాధికారి రాజేందర్ కు, సెక్టోరియల్ ఆఫీసర్లు లక్ష్మణ్, కిషన్ రావు, కరుణాకర్ కృష్ణమోహన్ కు విద్యార్థులు కృతజ్ఞతలు చెపపారు. గాంధీ సినిమా చూసిన విద్యార్థులందరికీ భాగిర్తిపేట ప్రధానోపాధ్యాయులు కొండ శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. రేగొండ మండలంలో బాగిర్తిపేట, చిన్నకోడపాక, తిరుమలగిరి, కనిపర్తి ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు సూదం సాంబమూర్తి, సూదమల్ల మురళి, గోవర్ధన శ్రీనివాసాచారి, కుక్కల రమేష్, సతీష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments