Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి పెసరు విజయ్ చందర్ రెడ్డి
స్పాట్ వాయిస్, దామెర : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని ఆ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి పెసరు విజయ్ చందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తున్న సందర్భంగా ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడామె లక్ష్యంగా ప్రతీ బూత్ కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీయే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని అభివృద్ధి చేయాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పని అయిపోయిందని, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుసు దాదాపు ఖరారైనట్టేనని, మెజారిటీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జయంత్ లాల్, కొండి జితేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గురిజాల శ్రీరామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జంగిలి నాగరాజు, ప్రధాన కార్యదర్శి వేల్పూల రాజుకుమార్, నాయకులు పిట్టల రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments