Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుపార్టీలకు అతీతంగా పథకాల అమలు

పార్టీలకు అతీతంగా పథకాల అమలు

పార్టీలకు అతీతంగా పథకాల అమలు
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
చర్లపల్లిలో ఆసరా పెన్షన్ల పంపిణీ
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పారదర్శక పాలన కొనసాగిస్తున్నారని, ఆసరా పెన్షన్లతో వృద్ధుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎంకే దక్కిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం నడికూడ మండలం చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ల గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందివ్వడమే లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments